ఘాజీ (2017)

ఆద్యంతం ఒకే అంశంపై సాగే సినిమాలు హాలీవుడ్ లో అతి సహజం. భారతదేశంలో అరుదు. ఒకవేళ తీయలనుకుంటే వ్యాపార లెక్కలు, ప్రేక్షకుల అభిరుచి, వీటిని బట్టి సినిమాకు ఎదురయ్యే ఆర్ధిక ఇబ్బందులు, ఇలా ఎన్నో అంశాలను మనసులో ఉంచుకోవాలి. మంచి విషయమేమిటంటే, ప్రేక్షకుల అభిరుచి మారిపోతోంది. మూస సినిమాలకన్నా కొత్తరకం సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా నటులు, నిర్మాతలు కూడా మారుతున్నారు. కొత్త దర్శకులను, సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి మంచి తరుణంలో వచ్చిన సినిమా…

ఓం నమో వేంకటేశాయ (2017)

రాఘవేంద్రరావు-భారవి-కీరవాణి-నాగార్జునల కలయిక అంటే ముందుగా “అన్నమయ్య” అనే ఓ ఆణిముత్యం గురుతుకువస్తుంది. తరువాత “శ్రీరామదాసు” అనే ఓ విజయం. ఇప్పడు వీరి కలయికలో వచ్చింది “ఓం నమో వేంకటేశాయ” అనే మరో భక్తిరస చిత్రం. దర్శకేంద్రుడి చివరి సినిమాగా చెప్పబడుతున్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ముఖ్య పాత్రలు పోషించగా “సౌరభ్ జైన్” వేంకటేశ్వరుడిగా నటించారు. “సాయి కృప ఎంటర్టైన్మెంట్స్” పతాకంపై “మహేష్ రెడ్డి” నిర్మించారు. కథ : తిరుమల వేంకటేశ్వరుడి (సౌరభ్ జైన్)కున్న అనేక…