క్షణం (2016)

ఓ దర్శకుడికి తన మొదటి సినిమా చాలా ముఖ్యం. ఎందుకంటే, అతడు తరువాత పరిశ్రమలో నిలబడతాడా లేదా అన్నది నిర్ణయించేది ఆ సినిమానే కనుక. అందుకే ఇప్పుడు పరిచయమయ్యే చాలామంది కొత్త దర్శకులు ఫార్ములాల మీద ఆధారపడుతున్నారు. వాటికి భిన్నంగా, “రవికాంత్ పెరేపు” అనే దర్శకుడు ఓ “సరైన” థ్రిల్లర్ సినిమాతో పరిచయం అయ్యాడు. అదే “క్షణం”. అడివి శేష్, అదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అడివి శేష్ కథను అందించాడు.…